Posts

Showing posts from November, 2020

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 32

ఈ భాగంలో ఎనిమిదవ స్కంధం నుంచి ఏనుగుల గూర్చిన మూడు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షం లోనిది. గజేంద్రుడు మదంతో నిండి ఉన్నాడు. ఆ ధాటికి అన్ని దిక్కులు, లోకాలు దడదడ లాడుతున్నాయి. రెండవది. గజేంద్రుడు తన పరివారంతో కలసి సరస్సులోనికి దిగాడు. ఆ ఏనుగులన్నీ జలకాలాడుతూ గోలచేస్తున్నాయి. మూడవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. రాక్షసులు, దేవతలు సముద్రమధనం చేస్తున్నారు. ముందుగా హాలాహలం వచ్చింది. శివుడు దానిని భక్షించాడు. తురువాత ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది. పండితులు వేదవచనాలు చదువుతుంటే, ఆమెకు ఏనుగులు మంగళ స్నానాలు చేయిస్తున్నాయి. ఇవిగో పద్యాలు. 8-36-క. (గజేంద్రుని మదం) తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను ఘట్టన సేయం గొండలు దలక్రిందై పడు బెండుపడున్‌ దిశలు సూచి బెగడున్‌ జగముల్‌. 8-45-క. (గజేంద్రుని జలకాలాటలు) తొండంబులఁ బూరింపుచు గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్‌ మెండుకొన వలుదకడుపులు నిండన్‌ వేదండకోటి నీరుం ద్రావెన్‌. 8-270-క. (లక్ష్మీదేవి మంగళ స్నానాలు) పండితసూక్తుల తోడుతఁ దుండంబుల

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 31

ఈ భాగంలో ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర, ఎనిమదవ స్కంధంలోని గజేంద్రమోక్ష ఘట్టంలోని మరో రండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. హిరణ్యకశిపుడు తన మాటవినని ప్రహ్లాదుడిని దండించాలనుకున్నాడు. భటులు ప్రహాదుడిని తీసుకువెళ్లి కొండల మీద నుంచి త్రోసారు, నిప్పుల మీద పడేసారు, నీళ్లలోకి తోసారు, ఏనుగులతో తొక్కించారు - ఇలా ఎన్నో బాధలకు గురిచేసారు. కానీ ఆశ్చర్యం! ప్రహ్లాదునికి చిన్న గాయమైనా కాలేదు. నిరంతరం హరినామ జపం చేస్తూ ఉన్నాడు. రెండవది. గజేంద్రుడు, మొసలిబారిన పడి పోరాడి అలసిపోయాడు. భక్తులు పిలవగానే "ఓయ్" యంటూ వచ్చే భగవంతుడిని, గజేంద్రుడు "ఓ" అంటూ శరణాగతి చేస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 7-193-ఉ.  (ప్రహ్లాదుని ప్రార్ధన) తన్ను నిశాచరుల్ వొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి కో పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుఁ గాని తాఁ గన్నుల నీరుదేఁడు భయకంప సమేతుఁడు గాఁడు భూవరా! 8-92-ఉ.  (గజేంద్రుని శరణాగతి) ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపులప్రభావ! రా వే

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 30

29వ భాగంలో వలెనే గజేంద్రమోక్ష ఘట్టానికి, సముద్ర మథనం ఘట్టానికి సంబంధించిన మరొక రెండు పద్యాలను చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు తన శక్తి కొలదీ పోరాటం చేస్తున్నాడు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది వాటి పోరాటం. అమీతుమీ తేలటంలేదు. రెండూ హేమాహేమీలే. పెనుగులాడుతున్నాయి. రెండవది. సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. శివుడు దానిని నివారించాడు. కామధేనువు, రెక్కలగుర్రం, ఐరావతం, కల్పవృక్షం వగైరా పుట్టాయి. వీటితో పాటుగా లక్ష్మీదేవి పుట్టినది. దేవతలందరిలోకీ విష్ణువును వరమాల వేసి వరించింది. ఒకరినొకరు సిగ్గుతో చూసుకోవడానికి తొందర పడుతున్నారు. ఇవిగో పద్యాలు. 8-54-క. కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్  గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్ 8-285-క. హరి చూచిన సిరి చూడదు సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్ హరియును సిరియునుఁ దమలో సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్. ఇప్పుడు ద్వంద్వశిల్పం చూద్దాం.

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 29

ఈ భాగంలో భగవంతుడు "కలడు" అనే పద్యాలు రెండు చూద్దాం. రెండూ పక్కపక్క ఘట్టాలలోనివి.  ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ఎనిమిదవ స్కంధంలోని మొదటి ఘట్టం, గజేంద్రమోక్షంలోనిది. సరస్సులోనికి దిగి, మొసలి బారిన పడిన గజేంద్రుడు  తన శక్తి కొలదీ పోరాటం చేసాడు. డస్సిపోయాడు. చివరికి ఈశ్వరుడిని శరణు వేడుకున్నాడు. అంతలోనే ఉన్నాడో లేడో అనే సందేహం వచ్చింది. రెండవది. ఎనిమిదవ స్కంధంలోని రెండవ ఘట్టం, సముద్ర మథనం లోనిది. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సముద్రాన్ని చిలుకుతున్నారు. మొదట హాలాహలం పుట్టింది. అందరూ  వెళ్లి శివుడిని శరణుకోరుతున్నారు. "కొందరు నీవు ఉన్నావో లేవో అనుకుంటారు", అంటున్నారు. ఇవిగో పద్యాలు. 8-86-క. కలఁ డందురు దీనుల యెడఁ, గలఁ డందురు పరమయోగి గణముల పాలం, గలఁ డందు రన్నిదిశలను, గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో? 8-225-క. కొందఱు గలఁ డందురు నినుఁ; గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం గొందఱు; గలఁ డని లేఁ డని కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా! ఇప్పుడు ద్వంద్వంశిల్పం చూద్దాం. రెండూ కందపద్యాలు. రెండింటిలోనూ కష్టాలలో ఉన్న జీవులు ఈశ్వరునికి మొరపెట్టుకుంటున్న సందర్

ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా? - 2

Image
  ప్రస్తావన: మొదటి భాగం లో చెప్పుకున్నట్టు, ఛందస్సు శబ్దప్రమాణము. పద్యాలలోని విరుపును ఎలా గుర్తించాలో చూసాము. పదబంధాలు (phrases) గురు శబ్దములతో మొదలు పెట్టి, లఘు శబ్దములతో ముగించాలని సూత్రీకరించాం.  ఈ భాగంలో గురు, లఘు శబ్దాలతో నడక ఎలా వస్తుందో గమనిద్దాం. మరొక్కసారి గురు శబ్దము అంటే ఎక్కువ దమ్ము-కాలం, లఘు శబ్దము అంటే తక్కువ దమ్ము-కాలం అని గుర్తుచేసుకుందాం. నడక అంటే ఏమిటి? పద్యంలో లయ, నడక అంటూ ఉంటారు. ఈ నడక అంటే ఏమిటి? కాళ్లతో నడచే నడకకు, పద్యాలలో నడకకూ ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక దాని ద్వారా ఇంకొకటి అర్ధం చేసుకోగలమా? “కాళ్ల నడక” అంటే కొంత సమయంలో, ఒకచోటి నుండి మరొక చోటికి (move in space over time) చేసే ప్రక్రియ. “పద్య నడక” అంటే కొంత సమయంలో, ఒక శబ్దం(స్వరం) నుంచి మరొక శబ్దం(స్వరం) కలుపుకుంటూ (movement in frequencies over time) చేసే ప్రక్రియ. “కాళ్ల నడక”లో - మామూలు నడక, కుంటి నడక, పరుగు, గెంత్తుట, కుప్పించి ఎగయుట, నాట్యం - ఇలా రకరకాలుగా విన్యాసాలు చేయవచ్చు. అలాగే నిర్దిష్టమైన రీతిలో (అదే ఛందస్సు) చేయగలిగితే పద్యాలలో కూడా మరిన్ని విన్యాసాలు వినవచ్చు. అందుకే పాదము (సంసృతంలో) అంటే “పద్యభాగము”, “

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 28

ఈ భాగంలో మూడు కంద పద్యాలు చూద్దాం. మూడూ ఒకటే సందర్భంలోనివి.భాగవతంలోని ఎనిమిదవ స్కంధంలోని మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రాన్ని చిలికే ఘట్టంలోనివి.  మొదటి పద్యం. దేవతలు, రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని పెకలించి తీసుకొని వచ్చి, సముద్రం మధ్యలో పెట్టారు. వాసుకిని బ్రతిమాలి తాడుగా చేసికొన్నారు. చిలకడం మొదలుపెట్టారు. అడుగుభాగం స్థిరంగా లేనందున పర్వతం అటూఇటూ ఊగుతున్నది. వాసుకి విడవండని పలికాడు. ఆ పర్వతం కాస్తా మునిగిపోయింది. రెండవ,మూడవ పద్యాల సందర్భం. శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతానికి నిలకడ కలిగించాడు. ఇప్పుడు ఆ సాగర మథనం నిరాఘాటంగా సాగుతున్నది. ఆ హడావిడికి భయపడి సముద్రంలోని జీవాలన్నీ ఎగసిపడుతున్నాయి. ఇవిగో పద్యాలు.  8-199-క. (మంధరగిరి ఒరిగిపోవుట) వి డు విడుఁ డని ఫణి పలుకఁగఁ గ డు భరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై బు డ బుడ రవమున నఖిలము వ డ వడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్. 8-211-క. (సాగరమథనం సాగుట) ఎ డ మఁ గుడి మునుపు దిరుగుచు గు డి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం గ డ లెడల సురలు నసురులుఁ దొ డి తొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్. 8-212-క. (జీవాలు ఎగసి బయట పడుట) వ డి గొ