Posts

Showing posts from September, 2021

బాలకాండ: 465-472 - రావణాసురుని వరములు - రంగనాథ రామాయణం

 సందర్భము: దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, తను ఇచ్చిన వరాల వలన విజృంభిస్తున్న రావణాసురుని గురించి బాధలు చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి రావణాసురుని వరాల గురించి తెలియజేస్తున్నాడు. బాలకాండ: 465-472 "య మ రులచేఁ జావఁ  డ సురులచేత -  స మ యఁడు గంధర్వ స మితిచేఁ జెడఁడు  ర జ నీచరుల చేత  గ్రా గ డెన్నఁడును -  భు జ గ సంఘములచేఁ  బొ లియఁ డెన్నఁడును  య క్షు లచే నీల్గఁ  డా లంబు లోనఁ -  బ క్షి   యూథంబుచేఁ  బ డఁడు, వానికిని  వ ర మిచ్చునప్పుడు  వా క్రువ్వఁ డయ్యె -  న రు లఁ గావున వాఁడు  న రులచేఁజచ్చు  వి శ దంబుగా నింక  వి నుఁడు హిరణ్య -  క శి పుఁడు లోకముల్  గా రించు నాఁడు  న ర సింహరూపంబు  నా రాయణుండు -  ధ రి యించి వాని వి దా రించినాఁడు   వాఁ డె   వీఁడై విశ్ర వ సునకుఁ బుట్టి -  వాఁ డు   గావున నేఁడు  నా రాయణుండు  వీ ని   నిర్జించు న వ్వి ష్ణుని నభయ -  దా నం బు మనమింకఁ  ద గ వేఁడవలయు" భావం: దేవతల చేత చావడు, అసురుల చేత నశించడు, గంధర్వుల చేత పతనమవడు, పాముల చేత చావడు, యక్షల చేతిలో ఓడడు, యద్ధములో పక్షుల చేత పడిపోనివాడు - కానీ నేను వరములు ఇచ్చినప్పుడు మనుషుల గురించిన వరము లేదు కావున మనషుల ద్వారా