Posts

Showing posts from December, 2020

ఛందస్సు పద్యాలు చదువుకోవడం ఎలా - 3?

Image
  మొదటి భాగంలో  లఘువులు, గురువుల ద్వారా పదాల కూర్పును చూసాం. గురువులు పద్యాల ఎత్తుగడకు ఉపయోగపడతాయి. లఘువులు దమ్ము తక్కువగా ఉన్నప్పుడు వాడతారు.  రెండవ భాగంలో  ఆ లఘువులు, గురువులగు అమర్చుకోవడం ద్వారా నడకలు ఎలా ఏర్పాడతాయో చూసాం. ఈ భాగంలో ఈ లఘువులు, గురువుల అమరికను రసపోషణకు ఎలా వాడతారో చూద్దాం.  రసపోషణ - పద్యనిర్మాణం ఊపిరి/దమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు, గురువు ఎత్తుకోవడానికి అనువు అని మొదటి భాగంలో చెప్పుకున్నాం. మన మనస్సులో ఏ భావం ఉన్నప్పుడు ఊపిరి బిగపడతాం? ఆ భావం వ్యక్తపరచడానికి గురువులు ఎక్కువగా ఉన్న పద్యం ఎత్తుకుంటారా? ఉదాహరణకు ఏదైనా ఉద్వేగం, ఉత్కంఠం అయిన సన్నివేశం చెప్పాలంటే గురువులు ఎక్కువగా ఉన్న పద్యం వ్రాస్తారా? మరి పద్యంలో లఘువులు ఎక్కువగా ఉంటే ఏ భావం పలుకుతుంది? ఏదైన కరుణ రసం పలికించాలంటేనో లేదా నీతి బోధ వంటివి చేయాలంటేనో ఎక్కువగా లఘువులు ఉన్న పద్యం ఎత్తుకోవాల్సిందేనా?   లఘువులు, గురువులు కాస్త అటూ ఇటూగా సమానంగా ఉంటే సాధారణ వర్ణనకు అనుకూలం. గురువులు ఒక రవ్వ ఎక్కువగా ఉంటే గాంభీర్యానికి అనుకూలం.  పట్టిక వృత్త పద్యాలను పూర్వభాగం (మొదటి అక్షరం నుండి యతి వరకు), ఉత్తర భాగం (యతి నుండి చివరి

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 35

ఈ భాగంలో భగవంతుని మీద దృష్టి ఎలా పెట్టాలో చెప్పే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. ప్రథమ స్కంధంలోనిది. మహాభారత యుద్ధం పూర్తయింది. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్లిపోతూ అంపశయ్య మీద, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచిచూస్తున్న భీష్ముడి దగ్గరకు వెళ్లాడు. ఆ భీష్ముడు అన్ని ఆలోచనలు మాని, ప్రశాంత చిత్తంతో భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. రెండవది. అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. తన సరస్సులోనికి వచ్చి అల్లరి చేస్తున్న గజేంద్రుడిని, మొసలి అదను చూసి, శబ్దంచేయకుండా, దృష్టి కేంద్రీకరించి ఒక యోగీంద్రుని వలెనే పట్టుకుంది. ఇవిగో పద్యాలు. 1-217-శా. (భీష్ముడు) ఆలాపంబులు మాని, చిత్తము మనీషాయత్తముం జేసి, దృ గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి, తత్కారుణ్యదృష్టిన్ విని ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి, భీష్ముండు సం శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీహరిన్, శ్రీహరిన్. 8-65-శా (యోగీంద్రుని వంటి మొసలి) పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ ర్యాదన్నక్రము విక్రమించెఁ గరిపాదాక్రాంతనిర్వక్రమై. ఇప్పుడు ద

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 34

33వ ,  31వ  భాగాలలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. మరి ఆ పిలుపు ఒక మధ్యవర్తి ద్వారా, లేఖ రూపేణా పంపితే భగవంతుండు ఎలా స్పందిస్తాడో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధం పూర్వభాగంలోని రుక్మిణీకల్యాణ ఘట్టం లోనివి. మొదటిది.  రుక్మిణీదేవికి ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారు. రుక్మిణీదేవి, అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి లేఖ పంపించింది. ఆ సందేశం విన్న శ్రీకృష్ణుడు, "నేను వస్తున్నాను!" అంటూ భరోసా ఇస్తున్నాడు. రెండవది. ఇచ్చినమాట ప్రకారం శ్రీకృష్ణుడు బయలుదేరి ఒక్క రాత్రిలో విదర్భకు చేరుకున్నాడు. బలరాముడు, ఎందుకైనా మంచిదని, వెనుకనే యదువీరులని తీసుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణుడు, రుక్మిణిని తీసుకుని వెళ్లిపోతున్నాడు. రుక్మిణి అన్న రుక్మి, ఇతర వీరులు వెంబడిస్తున్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణికి ధైర్యం చెప్తూ భరోసా ఇస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 10.1-1717-క  (అగ్నిద్యోతనుతో మాటలు) వచ్చెద విదర్భభూమికిఁ; జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్ దెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్." 10.1-1756-క.  (రుక్మ

భాగవతం - పోతన - ద్వంద్వశిల్పం - 33

31వ భాగంలో శరణాగతి చేస్తూ భగవంతుడిని "ఓ"యని పిలచిన పద్యాలు చూసాం. ఈ భాగంలో అగ్ని ద్వారా బాధపడుతున్న భక్తుల ఆర్తి చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది, ప్రధమ స్కంధంలోనిది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. తొడలు విరిగి పడివున్న దుర్యోధనుడికి,  "పాండవులకి వారసులు లేకుండా చేస్తా"నని, అశ్వద్ధామ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం నిద్రపోతున్న ఉపపాండవులని రాత్రిపూట చంపివేశాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువును సంహరించాలని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణాగ్ని ధాటికి విలవిల్లాడుతున్న ఉత్తర రక్షించమని శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నది. రెండవది. దశమ స్కంధం పూర్వ భాగంలోనిది. బాలకృష్ణుడు, అడవిలోని కాళింది మడుగులో కాళీయ మర్దన చేసాడు. ఆ మడుగు చూట్టూ గోపికలు, గోపబాలురందరూ చేరారు. చీకటి పడిపోయిందని అక్కడ ఆ రాత్రి గడిపారు. ఇంతలో ఆ అడవిలో కార్చిచ్చు బయలుదేరింది. అందరూ బలరామకృష్ణులను ప్రార్థిస్తున్నారు.  ఇవిగో పద్యాలు. 1-179-మ.  (ఉత్తర ప్రార్ధన) "ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ| డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రప్రభన్ వచ్చుచు| న్నది దుర్లోక్యము మానుపన్ శరణ మన్యం బేమియున్ లేదు నీ