Posts

Showing posts from September, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 24

16వ భాగంలో భాగంలో చెప్పుకున్న (“కమలాక్షు నర్చించు కరములు కరములు”) ద్వంద్వ శిల్పాన్ని గుర్తుచేసుకుంటే, దానిలో విష్ణుభక్తి పరాయణుల గురించిన పొగడ్త ఉన్నది. ఈ భాగంలో విష్ణుభక్తిని కాదనే వారిని తిరస్కరించే పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది, రెండవ స్కంధంలోనిది. భాగవతంలో మొదటి స్కంధం నాంది అనుకుంటే, రెండవది ప్రస్తావన. శుకమహర్షి విష్ణువంటే ఏమిటో, అవతారాల ప్రసక్తి, భక్తి అంటే ఏమిటో, భక్తులు/భాగవతులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. దీనిలో భాగంగానే విష్ణుచింతన చేయని వారిని తిరస్కరిస్తున్నాడు. రెండవది. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోనిది. హిరణ్యకశిపుడు, తన కొడుకైన ప్రహ్లాదునికి హరిభక్తి వలదని చెప్పి గురువులతో మరల పంపించినాడు. తిరిగి వచ్చిన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుని, “ఏదైనా ఒక్క పద్యం, తాత్పర్యము చెప్పు కన్నతండ్రీ!” అన్నాడు. ప్రహ్లాదుడు మళ్లీ హరిభక్తి చిట్టా విప్పాడు. హరి స్మరణచేసే చేతులే చేతులు, మాటే మాట, శ్రవణమే శ్రవణం అన్నాడు. అలా హరి సేవ చేయని శరీరము, ఒక శరీరమే కాదంటున్నాడు.  ఇవిగో పద్యాలు. 2-50-సీ. (శుకమహర్షి)  విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ!  చక్రిపద్య

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 23

ఈ భాగంలో, కాస్త పక్కపక్కనే ఉన్న రెండు పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భం. ఏడవ స్కంధంలోని ప్రహ్లాద చరిత్రలోని ఉపోద్ఘాతంలోని పద్యాలు. శుకమహర్షి ఇలా చెప్తున్నాడు. అప్పుడే రాజసూయ యాగం ముగిసింది. నూరు తప్పులు చేసిన శిశుపాలుని వెలుగు శ్రీకృష్ణునిలో ఐక్యమయింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. “అటువంటి ధూర్తుని ఆత్మ భగవంతునిలో ఎలా కలసిపోయింది?” అని పక్కనే ఉన్నటువంటి నారదుడిని ప్రశ్నించాడు. నారదుడు జవాబు ఇస్తున్నాడు. ఇవిగో పద్యాలు. 7-14-ఆ.   అలుక నైనఁ జెలిమి నైనఁ గామంబున  నైన బాంధవమున నైన భీతి  నైనఁ దగిలి తలఁప నఖిలాత్ముఁ డగు హరిఁ  జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు. 7-18-శా.   కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా  సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,  బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను  ద్ధామధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా! ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండూ వేరువేరు పద్యరీతులు. శిల్పమంతా మొదటి పద్యాన్ని పెంచి రెండవదానిని వ్రాయడంలో ఉన్నది. దీనికి “దృష్టాంత ద్వంద్వం” అని పేరు పెట్టుకోవచ్చు. అసలు విషయం ఒక చిన్న ఆటవెలదిలో చెప్పి దానిని వెనువెంటనే,

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 22

ఈ భాగంలో పండుగ వాతావరణం చిత్రించిన రెండు పద్యాలు చూద్దాము. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. తొమ్మిదవ స్కంధంలోనిది. ఈ స్కంధంలో రామాయణాన్ని సుమారు వంద పద్య గద్యాలలో వర్ణించాడు పోతన. శ్రీరాముడు, లంక నుంచి తిరిగి అయోధ్యకు తిరిగి వస్తున్నాడు. ప్రజలు నగరమంతా అలంకరించారు. పండుగ వాతావరణం నెలకొని ఉంది. రెండవది. దశమ స్కంధంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టంలోనిది. రుక్మిణి సందేశము అందుకున్న శ్రీకృష్ణుడు, ఒక్క రాత్రిలో ద్వారక నుంచి విదర్భకు చేరుకున్నాడు. అక్కడ రుక్మిణికి వివాహ సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజులలో ముహూర్తం. అంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది. 9-321-సీ.   వీథులు చక్కఁ గావించి తోయంబులు; | చల్లి రంభా స్తంభచయము నిలిపి|  పట్టుజీరలు చుట్టి బహుతోరణంబులుఁ; | గలువడంబులు మేలుకట్లుఁ గట్టి|  వేదిక లలికించి వివిధరత్నంబుల; | మ్రుగ్గులు పలుచందములుగఁ బెట్టి|  కలయ గోడల రామకథలెల్ల వ్రాయించి; | ప్రాసాదముల దేవభవనములను గోపురంబుల బంగారు కుండ లెత్తి యెల్ల వాకిండ్ల గానిక లేర్పరించి  జనులు గైచేసి తూర్యఘోషములతోడ నెదురు నడతెంచి రా రాఘవేంద్రుకడకు. 10.1-1719-సీ.   రచ్చలు గ్రంతలు రాజమార్గంబులు; | విపణిదేశంబులు విశదములుగఁ

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 21

ఈ భాగంలో “కర్మ” గురించిన పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. రెండూ దశమ స్కంధంలోనివి. మొదటిది. ఆకాశవాణి మాటవిని కంసుడు, తన చెల్లెలు దేవకి మీదకి కత్తి దూసాడు. వసుదేవుడు తనలో తాను తర్కించుకున్నాడు. కేవలం ఆలోచనతో సమయం వృధా చేయకుండా ఏదైనా చేసి కంసుడిని ఆపాలని నిర్ణయించుకున్నాడు. ఏంతో కష్టం వచ్చి మీద పడుతుంటే చేతలుడిగి కూర్చోకుండా ఏదో ఒక ప్రయత్నం చేయాలని తలచుకొని, కంసుడికి ధర్మ బోధ చేస్తున్నాడు.  రెండవది. నందుడు ఇంద్రయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు, “ఈ యాగం ఎందుకు చేస్తున్నార“ని అడిగాడు. నందుడు ఇంద్రుని వలన వానలు, వానల వలన పశుగ్రాసము, దాని వలన పశుసంపద వృద్ధి చెందుతుందన్నాడు. కృష్ణుడు కనిపించని ఇంద్రుడి కన్నా, ఎదురుగానున్న ప్రకృతిని, పశుపక్షాదులను ఆరాధించడం మేలని చెప్తున్నాడు .  ఇవిగో పద్యాలు.  10.1-32-క. (కంసునితో వసుదేవుడు)  కర్మములు మేలు నిచ్చును; గర్మంబులు గీడు నిచ్చుఁ; గర్తలు దనకుం  గర్మములు బ్రహ్మ కైనను; గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్? 10.1-885-క. (నందునితో శ్రీకృష్ణుడు) "కర్మమునఁ బుట్టు జంతువు కర్మమునను వృద్ధి బొందుఁ  గర్మమునఁ జెడుం గర్మమె జనులకు దేవత కర్మమె