Posts

Showing posts from May, 2021

కిష్కింధా కాండ: 26-32 - వసంతకాల వర్ణన - రంగనాథ రామాయణం

సందర్భము: ఋష్యమూక పర్వత ప్రాంతంలో వసంత ఋతువు వచ్చుట. కిష్కింధా కాండ: # 26-32 గ ల కంఠకల కుహూ కా ర నిస్వనము -  చె లఁ గించు వనము గ ర్జి లు ఘనాఘనము  గు లు కు పుప్పొడి మించుఁ  గ్రొ క్కారు మించు -  ద లి రుగొమ్మలు శక్ర  ధ నువుల యనువు  వ సు ధ రాలెడి విరుల్  వ ర్షోపలములు -  ము స రు తేనియసోన  ముం చినవాన  గా   నొ ప్పుచు వసంత కా లంబుఁ జూడ -  వా న కాలముఁ బోలి  వ సుధ నొప్పియును  జి గు రాకు శిఖలతోఁ  జి ట్టాడు తేటి -  పొ గ లతోఁ బొగడ పు ప్పొ డి బూదితోడ  బూ రు గుపూవు ని ప్పు కలతో నెగడి -  యా ర య విరహుల  క గ్నియై నిగుడి  కం తు   ప్రతాపాగ్ని కం   టెను గడఁగి -  యెం తే ని నాచిత్త  మె రియింపఁ దొడఁగె. భావం: కోకిల కూతలతో అడవిప్రాంతమంతా గర్జిల్లుతోంది. అందమైన పూవుల పుప్పొడి రాలుతుంటే తొలకరి జల్లులలాగా ఉన్నది. చిగురిస్తున్న కొమ్మలను చూస్తే  ఇంద్రధనుస్సుల లాగా ఉన్నాయి. నేల మీద రాలుతున్న పూవులు వర్షపు నీటి బిందువుల లాగా ఉన్నాయి. వసంతకాల పూవుల నుంచి కారుతున్న తేనె వర్షంలాగా ఉన్నది. చూస్తుంటే, ఈ వసంతకాలము వర్షాకాలం లాగా ఉన్నది. చిగురాకు కొమ్మలతో, సంచరిస్తున్న తుమ్మెదలతో, పరితపిస్తున్న పొగడ పూవుల పుప్పొడితో, బూరుగు ప

ఉ. తొండమునేక దంతము - 100 పద్యాలు

  ఉ. తొండమునేక దంతము తొం డ మునేకదంతమును   తో రపు బొజ్జయు వామ హస్తమున్ మెం డు గ మ్రోయు గజ్జెలును   మె ల్లని చూపులు మందహాసమున్ కొం డొ క గుజ్జు రూపమున   కో రిన విద్యలకెల్ల నొజ్జవై యుం డె డు పార్వతీ తనయ   ఓ యి గణాధిప! నీకు మ్రొక్కెదన్ 1.     తొండమున  + ఏకదంతమును 2.     తోరపు బొజ్జయు 3.     వామ హస్తమున్ 4.     మెండుగ మ్రోయు గజ్జెలును 5.     మెల్లని చూపులు 6.     మందహాసమున్ 7.     కొండొక గుజ్జు రూపమున 8.     కోరిన విద్యలకెల్లన్ 9.     ఒజ్జవై   యుండెడు 10.         పార్వతీ తనయ 11.         ఓయి గణాధిప! 12.         నీకు మ్రొక్కెదన్ అర్ధాలు : ఏక = ఒకటి ; తోరపు = పెద్దదైన ; వామ = చిన్న, అందమైన ; హస్తమున్ = చేతితో ; మెండుగ = ఎక్కవగా, చక్కగా ; మ్రోయు = శబ్దముచేయు ; మందహాసము = చిరునవ్వు ; కొండొక = చిట్టి, చిన్న ; గుజ్జు = పొట్టి ; ఒజ్జ = గురువు   ; మ్రొక్కు = నమస్కరించు ; భావం:   ఓ వినాయకా! పార్వతీ తనయా!   నీవు తొండమున ఏక దంతముతో, పెద్ద బొజ్జతో, అ

శా. తల్లీ నిన్ను దలంచి - 100 పద్యాలు

  శా. తల్లీ నిన్ను దలంచి త ల్లీ !   నిన్ను దలంచి పుస్తకము చే తన్   బూనితన్ నీవు నా యు ల్లం బందున నిల్చి జృంభణముగా ను క్తుల్ సుశబ్దమ్ము శో భి ల్లం బల్కుము నాదు వాక్కునను సం ప్రీ తిన్ జగన్మోహినీ ఫు ల్లా బ్జాక్షి! సరస్వతీ! భగవతీ!   పూ ర్ణేందుబింబాననా! 1.     తల్లీ! 2.     నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితన్ 3.     నీవు నా యుల్లంబందున నిల్చి 4.     జృంభణముగాన్ 5.     ఉక్తుల్, సుశబ్దమ్ము 6.     శోభిల్లం పల్కుము 7.     నాదు వాక్కునను 8.     సంప్రీతిన్ 9.     జగన్మోహినీ ! ఫుల్లాబ్జాక్షీ!  సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా! అర్ధాలు : నిన్ను దలంచి = నిన్ను తలచుకొని ; యుల్లము   = ఉల్లము = మనసు ; జృంభణముగా = ధారగా ; ఉక్తుల్ = వాక్యములు, మాటలు , విషయములు ; శోభిల్లం = అందంగా ; నాదు వాక్కునన్ = నా మాటలలో ;   పల్కుము = పలుకుము ; సంప్రీతిన్ = ఇష్టముతో ; జగన్మోహినీ = జగత్ + మోహినీ ; ఫుల్లాబ్జాక్షీ = ఫుల్ల + అబ్జ + అక్షి = విప్పారిన కన్నులతో ; పూర్ణేందు బింబాన

కిష్కింధా కాండ: 726-733 - శరత్కాల ఆగమనం

సందర్భము: సుగ్రీవునికి పట్టం కట్టి, శ్రీరాముడు వర్షాకాలం తరువాత శరత్ ఋతువు రాక కోసం చూస్తున్నాడు.  కిష్కింధా కాండ: 726-733  నం త   వానలు వెల్చె  న వనిపై నపుడు -  నం తం త దివి నున్న  య భ్రము ల్విరి సె  దె లి వొంది కిరణము  ది శె లెల్ల నిండెఁ -   జె లు వొంద రవి ప్రకా శిం చె లోకముల  ధ ర ణి నిష్పంకమై  త నరె నెంతయును -  గ ర మొప్ప గొలఁకులఁ  గ మలంబు లమరె గూ ల ము ల్మదకరుల్  గ్రు చ్చి గోరాడె -  రే లు   నక్షత్రచం ద్రి కలు పెంపారె  వ చ్చె   నంచలు సరో వ నికిఁ గాపురము -  మె చ్చెఁ   దామరతూండ్లు  మె లఁత లుల్లమున చె ఱు కు రాజనమును  చే నులపంట -  త ఱు   చయ్యె వృషభయూ థ ము రంకె వేసి.  గ ల క నంతయుఁ బాసి  క నుపట్టె జలము -  ఇ లఁ  దెరువరులకు  ని చ్చె సౌఖ్యంబు చ ద ల నిర్మలములై  జ లదంబు లొప్పె -  న దు   లెల నింకి కా ల్న డలయ్యె నంత భావం: వానలు తగ్గి, ఆకాశము విరిసింది. దిక్కులన్నీ వెలుగు నిండుతూ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. బురద నేలలు ఎండిపోయి, చెరువులలో కలువలు విరుస్తున్నాయి. ఏనుగులు నీటి గుంటలలో ఆడుకుంటున్నాయి. రాత్రి పూట చంద్రుడు, నక్షత్రాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో హంసలు సరోవరంలోనికి వచ్చాయి. తామర త

కిష్కింధా కాండ: 688-725 - వర్షాకాల వర్ణన

సందర్భము: శ్రీరాముడు, వాలిని సంహరించి సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేసాడు. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం పూర్తి అయిన తరువాతు సీతను వెతుకుదామని నిర్ణయించుకున్నారు. శ్రీరాముని దుఃఖము, రాబోవు రావణసంహార ఘట్టము ప్రకృతిలో కనిపిస్తున్నాయి. కిష్కింధా కాండ: 688-725 ధ ర ణిజ నెడఁబాసి   త లఁకెడు రాముఁ -   బొ రి పొరి దుఃఖము   ల్పొ దువు చందమున న ఱి ముఱి దివినుండి   యం బుజ మిత్రు -   మె ఱ యనీ కందంద   మే ఘము ల్వొడమె భావం: సీతను విడిచిన రాముడిని దుఃఖాని ముంచివేసినట్లుగా సూర్యుడిని వర్షాకాల మేఘములు కప్పివేసాయి. రా వ ణురాజ్యంబు   ర ఘురాముచేత -   నీ వి ధి చలియించు   నిం క నన్పగిడి నొ ల సి యొండొండ వి ద్యు న్ని కాయములు -   జ ల దంబులందుండి   చ లియింపఁదొడఁగెఁ భావం: రావణుని రాజ్యము రఘురాముని చేత, కదలింప బోవునట్లు సూచనగా మేఘాలనుండి మెరుపులు కదలుతున్నాయి. గై కొ ని యింక ని క్ష్వా కులవల్ల -   నా కా రిపై దండు   న డుచుచున్నాఁడు అ ని   సురలకుఁ జెప్ప   న రిగెనో ధాత్రి -   య న   వాయువులఁ దోడ   న ట ధూళి యెసఁగె. భావం: ఇక్ష్వాకుని వంశజులు రావణునిపై దండెత్తుతున్నారని దేవతలకు చెప్పటానికి భూమి మీద గాలి, దుమ్ము ఎత్తుకు లేస్