Posts

Showing posts from July, 2020

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 15

ఈ భాగంలో బ్రహ్మ దేవుని గురించిన పద్యాలు చూద్దాం. ముందుగా కథా సందర్భాలు. మొదటిది. పోతన భాగవత రచన చేయటం మొదలుపెట్టి, దేవతాస్తుతి చేస్తున్నాడు. మొట్టమొదటిది సంకల్పం / భగవంతుని తత్వం / శ్రీకృష్ణుని స్తుతి . రెండవది శివ స్తుతి. మూడవ పద్యం బ్రహ్మ దేవుని స్తుతి. రెండవది. వ్యాస మహర్షి ఆలోచనలో పడ్డాడు. పండితుల కొరకు వేదాలను విభజించాడు. పామరుల కొరకు వేదసారమైన మహాభారతం రచించాడు. అయినా ఆ మహర్షిలో ఒకరకమైన వెలితి. భగవంతుని గురించిన రచన చేయలేక పోయానే అనే చింత. ఇంతలో నారదుడు వచ్చి వేదవ్యాసుడిని పొగుడుతున్నాడు. అపర బ్రహ్మవి అంటున్నాడు. ఇవిగో పద్యాలు. 1-3-ఉ. (బ్రహ్మదేవుని స్తుతి)  ఆతతసేవ సేసెద సమస్తచరాచర భూతసృష్టివి  జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని  ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్‌ నత  త్రాతకు ధాతకున్‌ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్‌. 1-89-ఉ. (వ్యాసదేవుని స్తుతి)  ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాత వి  జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని  ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే  కాతరు కైవడిన్‌ వగవఁ గారణమేమి పరాశరాత్మజా? ఇప్పుడు ద్వంద్వ శిల్పం చూద్దాం. రెండు పద్యాలు ఉత్పలమ

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 14

పన్నెండవ భాగంలో, పోతన మొదటి పద్యాన్ని ప్రతిపాదనా పద్యంగా వ్రాసినాడని చెప్పుకున్నాం. ఆ పద్యంలోని “సంరంభం” అనే పదం ఎలా వాడబడినదో చూసాం. అలాగే 3, 6, 13వ భాగాలలో మొదటి స్కంధానికీ, దశమ స్కంధంలోని రుక్మిణీకల్యాణ ఘట్టానికీ ముడిపెట్టాం. చూడగా చూడగా గ్రహింపుకొస్తున్న విషయం ఏమిటంటే, భాగవత కర్త మొదటి స్కంధాన్ని “నాంది” (introduction) స్కంధంగా మలిచారు. ఈ భాగంలో మొదటి స్కంధలో నుండి రెండు పద్యాలు తీసుకుందాం. ముందుగా కథా సందర్భం. మొదటిది. కురుక్షేత్ర యుద్ధానంతరం ద్వారకకు తిరిగి వెడుతూ కృష్ణుడు, మృత్యువు కోసం వేచిచూస్తున్న భీష్ముని వద్దకు వెళ్లాడు. భీష్ముడు కృష్ణుని చూసి, ఆనాడు యుద్ధభూమిలో తన మీదకు చక్రంతో దూసుకు వచ్చిన రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ప్రస్తుతిస్తున్నాడు. రెండవది. కురుక్షేత్ర యుద్ధానంతరం, అశ్వద్ధామ ఉత్తర గర్భంలోనున్న పరీక్షిత్తు మీదకు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాని నుంచి ఆ గర్భస్థ బాలుడిని రక్షించడానికి గదా ధరుడై వచ్చిన రూపాన్ని వర్ణిస్తున్నాడు. 1-223-సీ. (యుద్ధభూమిలో)  కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;  నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; జగముల వ్రేఁగున జగతి గద

భాగవతం - పోతన - ద్వంద్వ శిల్పం - 13

ద్వంద్వ శిల్పం వ్యాసాలలో 3వ, 6వ భాగాలకూ దీనికీ కొంత సామ్యమున్నది. ఆ భాగాలలో మొదటి స్కంధానికీ, దశమ స్కంధంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టానికీ ముడిపెట్టాం. ఈ వ్యాసంలో కూడా అంతే. ముందుగా కథా సందర్భం. మొదటిది. నైమిశారణ్యములో ఉన్న సూతమహాముని వద్దకు, శౌనకుడు మొదలైన మునులు వచ్చి భగవంతుని అవతారము గురించి చెప్పమని అడుగుతున్నారు. ముఖ్యంగా వసుదేవుడు, దేవకిలకు ఉదయించిన అవతారము గురించిన కథలు చెప్పమని కోరుతున్నారు. రెండవది. రుక్మిణీదేవి, తనకు ఇష్టంలేని పెళ్లి తప్పించమని, కృష్ణుడిని వరించానని లేఖ వ్రాసింది. ఆ లేఖలోని మొదటి పద్యం. 1-45-సీ .  ఎవ్వని యవతార మెల్ల భూతములకు; సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;  నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ; సంసార బంధంబు సమసిపోవు;  నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ; భయమొంది మృత్యువు పరువువెట్టు;  నెవ్వని పదనది నేపాఱు జలముల; సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;  తే. దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి  తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు  నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ  నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత!  10.1-1704-సీ.   ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు  నే నీ శుభాకార మ