ఎక్కడిదీ పద్యం - "మరుద్వృథా" ?

 తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక ఘట్టం. శ్రీకృష్ణదేవరాయని సభకు నరసరాజు అనే కవి వచ్చి "ఘంటం ఆపకుండా వ్రాస్తా"ననే సవాలు చేస్తాడు. అప్పుడు  ముక్కుతిమ్మన "మరు ద్వృథా" అంటూ ఒక పద్యం చదువుతాడు. ఈ పద్యం, ముక్కుతిమ్మన వ్రాసి పారిజాతాపహరణము కావ్యంలోనిది అని  ఈ మథ్యనే తెలిసింది.

మూడవ ఆశ్వాసం చివరలోని పద్యం. శ్రీకృష్ణదేవరాయలుని పొగుడుతూ సాగే పద్యం. 

పూర్తి పద్యం, పారిజాతాపహరణం - పంచచామరం - 3.61

రుద్వృథా తటస్థ శత్రుమండలీ గళాంతర
క్షన్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ!
రుత్పతిస్వరుక్షతిక్రత్రుటత్కుభృద్వర
స్ఫుద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ!

పద్యం టీకా, తాత్పర్యము - నాగపూడి కుప్పుస్వామి పుస్తకం నుండి.


--
ఈ పద్యం "నోరు తిరగని" పద్యం అనటం కన్నా "చేయి తిరగని" పద్యం అనటం సబబు. ఎందుకంటే ఈ పద్యంలో వ-వత్తు (ద్వృ, స్వ, ద్వ వగైరా), ఋ-కారం (సృ, దృ వగైరా), ఇంకా భ,ధ వగైరా వత్తులు పుష్కలంగా ఉన్నాయి. ఇటువంటివి ఘంటంతో తాళపత్రాలపైన వ్రాయటం కష్టం. ఈ ఛందస్సు కూడా ప్రత్యేకమైనదే. పంచచామరం వృత్తంలో ప్రతి రెండో అక్షరం గురువు. లఘువుకన్నా మరికొంత కష్టపడి వ్రాయవలసి వస్తుంది. అంటే అడుగడుగునా కష్టమన్నమాట.

మరొక్క మాట. అల్లసాని పెద్దన తన మనుచరిత్ర కావ్యంలో ఈ ఛందస్సులోనే ఒక గమ్మత్తైన పద్యం వ్రాసాడు. ఒకానొక రాక్షసుడు ఆకలితో ఉన్నాడు. ఎదురుగా యుద్ధానికి వచ్చిన రాజుని భళిభళీ తినేస్తా అంటాడు. ఆ పద్యం ఇదిగో:

పలాశి డాసి రాజుఁ జూచి పల్కె నోరి! నోరి కీ
పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దోఁచి తౌ
బలా! బలాలితోడఁ బాలఁ బట్టి బిట్టు చుట్టి నిన్‌
హళాహళిన్‌ హలాహలాభ యౌ బుభుక్షఁ దీర్చెదన్‌.


--

మిత్రులు శ్రీనివాస కె. శివరాజు గారికి ధన్యవాదాలతో.

Comments